Loading...
.

మృత్యుదేవత....

పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వూరుకున్నాడట సంహారం సంగతి ఆలోచించనే లేదు. జనాభా అంతకంతకూ పెరిగిపోయి భూమికి భారమైపోయారు ఆ క్షణం ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ బాధపడుతున్న బ్రహ్మ అవయవాలనుంచి ప్రళయాగ్ని పుట్టి ప్రజాసంహారం మొదలుపెట్టింది. భువనాలన్నీ అలా తగలబడిపోతుంటే చూడలేక పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి "అయ్యా నీ వల్ల పుట్టిన ఈ సృష్టిని కోపగించి నువ్వే నాశనం చేయటం తగునా అని ప్రార్ధించి దయతో యీ భూతాజాలన్ని కరుణించమని కోరెను" ఆ మాటలు విన్న విధాత తన కోపాన్ని దిగమింగే సమయంలో అతని ఇంద్రియాల నుంచి ఒక బయంకరమైన స్త్రీ ఉద్బవించింది
"నల్లని శరీరం , నిప్పుకణికల్లాంటి కళ్ళు, మెడలో పుర్రెలూ ,పొడవైన నల్లని జుత్తు, ఎర్రటి వస్త్రాలు, అతి భయంకరంగా వుంది" చకచక నడిచి వెళ్తోంది 'అమ్మాయీ !ఎక్కడికి పోతున్నావు ? ఇలారా అని పిలిచాడు బ్రహ్మ వచ్చి వినయంగా నిలబడింది
'నాలో పుట్టిన క్రోధం వల్ల జన్మించావు నువ్వు. అందుకని నా ఆజ్ఞ ప్రకారం నువ్వింక అన్ని ప్రాణుల్నీ సంహరిస్తూ వుండు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ' ఆ మాటలు విన్న ఆ స్త్రీ జలజలా కన్నీళ్ళు కార్చింది . కరుణామూర్తీ నువ్వు సృష్టించావు నన్ను ఈ దుర్మార్గపు పని ఎలా చెయ్యమంటావు? ప్రజల ఏడుపు నేను చూడలేను ఈ అధర్మానికి నన్ను పంపకు నేను ధేనుకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వమని వేడుకుంది.
అది విన్న బ్రహ్మ "పిచ్చిదానా ! నిన్ను ప్రజా సంహారం కోసమే సృష్టించాను అయినా ప్రజాసంహారం వల్ల నీకు అధర్మం ఎలా కలుగుతుంది? నా ఆజ్ఞ పాలించడం ధర్మం కాదా నీకు? నీకు అత్యుత్తమ కీర్తి లభించేటట్టు నేనూ పరమేశ్వరుడూ అనుగ్రహిస్తాం . నీవు మనస్సులో ఏ వికిరాలూ పెట్టుకొక సమయాన్ననుసరించి సంహారం చేయ్ అని ఆజ్ఞాపించెను.
" ప్రభూ! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను కానీ "ఎవరైతే నాలుగు రకాల భూతాలనూ జయిస్తారో ఎవరైతే ధర్మ మార్గన్ని అనుసరాస్తారో , న్యాయాన్ని కాపాడుతారో వారి జోలికి నేను వెళ్ళలేను" అని వేడుకున్నది . కనుక స్వామీ లోభం,క్రోధం, అసూయ అనేవి ప్రాణుల శరీరాల్ని వికృతం చేసేటట్టు చూడు అంది దుఃఖిస్తూ
అలాగే ఇప్పుడు నువు కార్చిన కన్నీటిబిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తూ మరణాలు సంభవింప చేస్తాయి అందుచేత నీకు ఏ అధర్మం అంటదు ప్రాణుల్ని చంపడమే నీకు పరమధర్మం నువ్వు తరతమ భేదాలు లేకుండా అందర్నీ ఆకర్షించు వెళ్ళు అని అన్నాడు బ్రహ్మ..
ధర్మహాని లేదనే నమ్మకం కుదిరాక ఆమె ఆ పనికి అంగీకరించింది అప్పటినుంచీ మనోవ్యధ, రోగాలూ ప్రాణుల శరీరాల్ని కృశింప చేస్తుంటే మృత్యువు ప్రాణం తీస్తూ వస్తోంది ...

0 comments:

Post a Comment

కూడలి