1400 సంవత్సరాల ముందు కధను చెప్పుకుంట్టున్నాము. మహమ్మదు ప్రవక్త మక్కాను జయించి మదీనాలో ఉన్నారు. మదీనా చారిత్రాత్మకమైనది.చాలా పవిత్రస్దలం కూడానూ అక్కడే బిలాల్ అనే ఒక నీగ్రో బానిస ఉండేవాడు అప్పట్లో నీగ్రోలను చాలా హీనంగా చూసేవారు కానీ మహమ్మద్ ప్రవక్త దృష్టిలో అందరూ సమానమే. అటువంటిది ఒక రోజు ప్రవక్త బిలాల్ ని పిలిచి నమాజుకు వేళయింది మిద్దె మీదికి వెళ్ళి అందరినీ పిలవమని చెప్పాడు ప్రవక్త ఆదేశాను సారం బిలాల్ వెంటనే మిద్దె మీదికి వెళ్ళి నమాజుకు పిలవడానికి నిలబడ్డాడు. నల్లని రంగు,మెద్దు పెదవులు ఉన్న అతణ్ణి చూసి గర్విష్టులైన కొందరు అరబ్బులు చీ చీ ఈ నల్ల నీగ్రో బానిస మనల్ని నమాజుకు పిలవటమూనూ మనం వెళ్ళటం చీ అని బిలాల్ మీద చీదరించుకున్నారు అంతే ఆ మరుక్షణం వీరికి సమాధానం చెప్తున్నారా అన్నట్లుగా ప్రవక్త ఇలా చెప్పారు మన గర్వం,పాపం, అజ్ణానం, తొలగించిన అల్లాకు జయమగుగాక ప్రజలారా ఇది గమనించండి ప్రజలంతా రెండు తెగలుగా విభజించబడ్డారు దేవుని నమ్మిన పుణ్యాత్ములు ఒకరు, పాపాత్ములు,కఠినాత్ములు ఇంకొకరు అయిననూ అందరునూ దేవుని సంతానమే అని సెలవిచ్చారు ప్రవక్త ఈ మాటలతో మహమ్మదు ప్రవక్త వారిలో గొప్ప మార్పును తెచ్చారు అంతే ఆ మరుక్షణం కొందరు అరబ్బులు తమ కుమార్తెలను ఆ నీగ్రో బానిస అయిన బిలాల్ కిచ్చి పెళ్ళి చేయటానికి ముందుకు వచ్చారు .... ఎంత మార్పు ఎంత
సమభావం ..
ఇస్లాం మతస్దుడు ఏ దేశపు వాడైనా మొత్తం ప్రపంచంలో వున్న ముస్లింలందరూ అతణ్ణి తమ సోదరుడిగా భావిస్తారు. ఒక రెడ్ ఇండియన్ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే , టర్కీ సుల్తాను అయినా సరే అతడితో కలసి ఆహారం తీసుకోవడానికి సందేహించడు అని తెలియచేసారు.
గూగుల్ యాడ్ సెన్స్ చెక్ సమయానికి చేరని సందర్భంలో....
-
గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా చెక్ లు పొందేవారు సమయానికి చెక్ తమకి చేరని
సందర్భంలో ఈ క్రింది లింకును క్లిక్ చేసి మీ వివరాలను తెలియజేస్తూ గూగుల్ యాడ్
సెన్స్ సపో...
13 years ago
0 comments:
Post a Comment